టీడీపీ, వైసీపీ మధ్య ఆగని ట్విట్టర్ వార్

Update: 2019-04-28 13:22 GMT

టీడీపీ, వైసీపీ మధ్య మళ్లీ ట్విట్టర్ వార్ మొదలైంది. సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ నేత విజయసాయి రెడ్డి తాజాగా మరికొన్ని ట్వీట్స్ పోస్ట్ చేశారు. దీంతో మళ్లీ ట్విట్టర్ వేదికగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఈసీ అడ్డుపడటంతో పిడుగుల్ని ఆపలేకపోయానని చంద్రబాబు అన్నారని విజయసాయి రెడ్డి తెలిపారు. రాష్ట్రం ఫణి తుఫానుకు గురికాబోతోందని.. తెలిసి కూడా సీఎం సిమ్లాలో విశ్రాంతి తీసుకుంటున్నారంటూ ట్వీట్ చేశారు.

పోలవరం, సీఆర్డీఏలపై రివ్యూలు చేస్తే కమీషన్లు వస్తాయి. తాగునీటిపై సమీక్షలు చేస్తే ఏం వస్తాయని చంద్రబాబు అనుకున్నట్టుంది అని విజయసాయి రెడ్డి తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. త్వరలో తాను జెలుకు వెళ్లడం ఖాయమని, ఓ అవినీతి మంత్రి అన్నారని వచ్చే ఏడాది జైల్లో ఉండే ఆ మంత్రిని, చంద్రబాబును పరామర్శించడానికి తాను ఎలాగు జైలుకు వెళ్లాలన్నారు. విజయసాయి రెడ్డి చేసిన తాజా ట్వీట్స్ తో మళ్లీ ట్విట్టర్ లో రాజకీయ వేడి రాజుకుంది. 

Full View

Similar News