చంద్రబాబుపై మరోసారి కేటీఆర్ ఫైర్
ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి అభినందన సభలో బాబుపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న పథకాలనే యథాతథంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారని ఆరోపించారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై మరోసారి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి అభినందన సభలో బాబుపై ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న పథకాలనే యథాతథంగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఏం చేస్తే తాను కూడా అవే చేస్తే గెలుస్తానని చంద్రబాబు అనుకుంటున్నారని అన్నారు. చిత్తశుద్ది లేని శివపూజలు చేస్తే ఏం జరిగేది లేదని కేటీఆర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అక్కడి జర్నలిస్టులు చాలా తెలివైన వాళ్లు, చైతన్యవంతులని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.