స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్‌

Update: 2019-05-12 13:57 GMT


స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి పేర్లను టీఆర్ఎస్‌ ఖరారుచేసింది.  


స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్‌ ఖరారు చేసింది. అభ్యర్ధుల ఎంపికపై ... సీనియర్ నేతలు, మంత్రులతో చర్చించిన అనంతరం ... పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి పేర్లను ఖరారు చేశారు. దీనికి సంబంధించి కాసేపట్లో ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. గత కేబినెట్‌లో మంత్రిగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి .. చేవేళ్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇదే సమయంలో నాగార్జున సాగర్‌‌‌ నియోజకవర్గం టికెట్ నోముల నర్సింహయ్యకు ఇవ్వడం వల్ల తేర చిన్నపరెడ్డికి చోటు దక్కలేదు. దీంతో ఈ సారి అవకాశం కల్పించారు. ఇక సీఎం కేసీఆర్‌ అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డికి కూడా ఈ అవకాశం కల్పించారు. 

Similar News