అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా మాజీ మంత్రి పద్మారావుగౌడ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు అధికార టీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్, మజ్లీస్, బీజేపీ నాయకులతో సంప్రదింపులు జరిపింది. ఎంఐఎం, బీజేపీ ఏకగ్రీవానికి ఆమోదం తెలపగా కాంగ్రెస్ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే అధికారికంగా ఇవాళ ఉదయం వెల్లడిస్తామని స్పష్టం చేసింది.