ఏపీలో ఆదిక్యాలు

Update: 2019-05-23 03:03 GMT

ఏపీలో ఆదిక్యాలు తెలుస్తున్నాయి. టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం..

మంగళగిరిలో లోకేశ్ ఆధిక్యంలో ఉండగా, చీపురుపల్లిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది. భీమిలిలో టీడీపీ నేత సబ్బం హరి ఆధిక్యంలో ఉండగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. టెక్కలిలో అచ్చెన్నాయుడు, శ్రీకాకుళంలో వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు, బొబ్బిలిలో టీడీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు, నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, అరుకులో కిడారి శ్రవణ్ కుమార్, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, మండపేటలో వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రాపురంలో టీడీపీ నేత తోట త్రిమూర్తులు ఆధిక్యంలో ఉన్నారు.

Similar News