తుప్రాన్ లో భారీ ఎత్తున నగదు సీజ్

Update: 2019-03-24 03:52 GMT

మెదక్ జిల్లా తుప్రాన్ లో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారులో 13 లక్షల 70వేలు పట్టుబడ్డాయి. తూప్రాన్ కు చెందిన రాజయ్య, నర్సింగరావు, లక్ష్మణ్‌ల డబ్బుగా పోలీసులు గుర్తించారు. భూమి విక్రయించి నగదు తీసుకొస్తున్నట్టు పోలీసులకు బాధితులు వివరించారు. దీనికి సంబంధించిన తగిన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి కలెక్టర్ కార్యాలయంలో అప్పగిస్తామని సి.ఐ లింగేశ్వరరావు తెలిపారు. 

Full View

Similar News