తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా..
తెలంగాణ వాసుల దశాబ్దాల కల నెరవేరింది. రాష్ట్రంలో ప్రత్యేక హైకోర్టు కొలువుదీరింది. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు విభజన కోసం ఆ స్థాయిలో ఉద్యమం సాగినా నాలుగున్నరేళ్ల తర్వాత ఆ ఆకాంక్ష నెరవేరింది.
తెలంగాణ వాసుల దశాబ్దాల కల నెరవేరింది. రాష్ట్రంలో ప్రత్యేక హైకోర్టు కొలువుదీరింది. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు విభజన కోసం ఆ స్థాయిలో ఉద్యమం సాగినా నాలుగున్నరేళ్ల తర్వాత ఆ ఆకాంక్ష నెరవేరింది. మంగళవారం తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో.. గవర్నర్ నరసింహన్ ప్రదాన న్యాయమూర్తితో ప్రమాణస్వీకారం చేయించారు. తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.
ఆ తర్వాత గవర్నర్ విజయవాడకు వెళ్లడంతో.. మిగతా న్యాయమూర్తుల చేత.. ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయించారు. హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. 12 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ రామ సుబ్రమణ్యన్, జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, జస్టిస్ సత్యరత్న శ్రీరామచంద్ర రావు, జస్టిస్ అడవల్లి రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ పొనుగంటి నవీన్ రావు, జస్టిస్ చల్లా కోదండరాం చౌదరి, జస్టిస్ బొలుసు శివశంకర్ రావు, జస్టిస్ డాక్టర్ షమీన్ అక్తర్, జస్టిస్ పొట్లపల్లి కేశవరావు, జస్టిస్ అభినంద్ కుమార్ షావలి, జస్టిస్ తొడుపునూరి అమర్ నాథ్ గౌడ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సహా.. న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది తదితరులు హాజరయ్యారు.