ఆదిలాబాద్ జిల్లాలో విషాదం..

Update: 2019-05-08 13:25 GMT

ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం కొత్తపల్లి కోలంగూడలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి విందు వికటించి నలుగురు చెందగా, మరో 25 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థకు గురైన వారిని ఉట్నూర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే నలుగురు మృతిచెందడానికి విందు భోజనం వికటించడమే కారణమా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నకోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు ఐటీడీఏ పీవో, డీఎస్పీలు నార్నూర్ ఆస్పత్రికి చేరుకుని ఘటనకు సంబంధించి ఆరా తీస్తున్నారు. కాగా నిల్వ ఉంచిన మాంసం తినడం వల్లే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో వైద్యులు, పోలీసులు ఆరా తీస్తున్నారు. 




 


Similar News