తెలంగాణలో ఒంటిగంట వరకు 38.08శాతం నమోదు

Update: 2019-04-11 09:12 GMT

తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 38.08 శాతం పోలింగ్‌ నమోదైంది. కరీంనగర్‌లో 45.62 శాతం, ఖమ్మంలో 41.62 మహబూబాబాద్‌లో 47.29, వరంగల్‌లో 40.24 శాతం నమోదయింది. కేసీఆర్‌ దంపతులు సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ నందినగర్‌లో కేటీఆర్‌ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమాజిగూడ ఎంఎస్‌ మక్తాలోని అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా నరసింహన్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ఓటేయడం మన విధి అని ఆయన అన్నారు.

Similar News