జానారెడ్డి, షబ్బీర్ అలీకి ఇంటెలిజెన్స్ శాఖ షాక్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ షాక్ ఇచ్చింది.

Update: 2019-01-05 15:55 GMT

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీకి తెలంగాణ ఇంటెలిజెన్స్ షాక్ ఇచ్చింది.అసెంబ్లీ ఎన్నికల్లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుకున్నందుకు డబ్బులు చెల్లించాలని వారికి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి 87 రోజులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడినందుకు కిలోమీటర్ కు 37 రూపాయలు, డ్రైవర్ బత్తా రోజుకు వంద రూపాయల చొప్పున మొత్తం నాలుగు లక్షల 20 వేల 94 రూపాయలు చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక షబ్బీర్ అలీ 90 రోజులు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ వాడినందుకు నాలుగు లక్షల 79 వేల 936 రూపాయలు చెల్లించాలని నోటీసు జారీ చేశారు.  

Similar News