కర్నూల్ జిల్లాలో కలకలం..డోన్ లో కోట్ల అనుచరుడి హత్య

Update: 2019-05-22 06:46 GMT

కర్నూలు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. డోన్‌ మండలం తాపలకొత్తూరులో శేఖర్‌రెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు దారికాచి బండరాయితో మోది చంపారు. శేఖర్‌రెడ్డిని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వర్గానికి చెందిన అనుచరుడిగా గుర్తించారు. అయితే హత్యకు రాజకీయ కక్షనా..? వ్యక్తిగత కారణమా..? అనే కోణంలో విచారణ జరుగుతోంది. మరోవైపు శేఖర్‌రెడ్డి హత్యతో డోన్‌ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Similar News