టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాను అధిష్ఠానం మరికాసేపట్లో విడుదల చేయనుంది. తొలి జాబితాలో 120 నుంచి 140 మంది అసెంబ్లీ అభ్యర్థులతో పాటు 14 నుంచి 17 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు కొత్తవాళ్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో పూర్తి జాబితాను చంద్రబాబు విడుదల చేయనున్నట్టు సమాచారం.