హేమమాలిని నృత్య ప్రదర్శనకు సుష్మా ఫిదా
సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని నృత్య ప్రదర్శనకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఫిదా అయిపోయారు. ప్రవాసి భారతీయ దివస్ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లోని వారణాశిలో హేమమాలిని ‘మా గంగా’ పేరిట నృత్య ప్రదర్శన ఇచ్చారు.
సినీ నటి, బీజేపీ ఎంపీ హేమమాలిని నృత్య ప్రదర్శనకు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఫిదా అయిపోయారు. ప్రవాసి భారతీయ దివస్ సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లోని వారణాశిలో హేమమాలిని 'మా గంగా' పేరిట నృత్య ప్రదర్శన ఇచ్చారు. తొంభై నిమిషాల పాటు సాగిన ఈ నృత్య నాటకాన్ని వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి అతిథులు హాజరయ్యారు. ప్రదర్శన ముగిసిన అనంతరం సుష్మా స్వరాజ్ వేదికపైకి వెళ్లి హేమను ఆలింగనం చేసుకున్నారు.