హైదరాబాద్ రాజేంద్రనగర్ శివారులో విషాదం చోటు చేసుకుంది. శివరాంపల్లి దగ్గర్లోని ఏ టూ జెడ్ స్విమ్మింగ్ పూల్లో పడి మహ్మద్ ఖాజా అనే విద్యార్థి మృతి చెందాడు. ఈత నేర్చుకోడానికి వచ్చిన బాలుడు స్విమ్మింగ్ పూల్లో దిగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోచ్ లేడని, నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్విమ్మింగ్ పూల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.