రిజల్ట్స్‌కి హోటళ్ళు హాస్‌ఫుల్..!

Update: 2019-05-22 11:20 GMT

రేపు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో విజయవాడలో హోటల్ రూమ్స్, లాడ్జీలు హౌస్ ఫుల్ అయ్యాయి. త్రీ స్టార్ హోటల్స్ నుంచి సెవెన్ స్టార్ హోటల్స్ వరకూ ఎక్కడ రూమ్ లు ఖాళీలు లేవు. ఇప్పటికే పలువురు అభ్యర్థులు, వారి అనుచరులు బెజవాడకు చేరుకున్నారు. ఎన్నికల ఫలితాల సరళిని స్వయంగా గమనించేందుకు పార్టీల అభ్యర్థులు, నాయకులు, మద్దతుదారులు ఆన్ లైన్ ద్వారా విజయవాడలోని హోటల్స్ , లాడ్జీల్లో ముందస్తు బుకింగ్ లు చేసుకున్నారు. రేపు ఫలితాలు ప్రకటించిన తర్వాత మరింత మంది బెజవాడకు రానున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని హోటల్స్ ధరలను అమాంతంగా పెంచాయి.  

Similar News