ఒడిషా నుంచి ముంబైకి యువతుల తరలింపు.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Update: 2019-04-28 10:49 GMT

ఒడిషా నుంచి ముంబైకి కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలులో 17 మంది యువతులను తలిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చైల్డ్ లైన్ అదుపులోకి తీసుకున్నారు. మానవ అక్రమ రవాణా కోసం ఇద్దరు మహిళలు యువతులను తరలిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. రాజమహేంద్రవరం రైల్వే, టూటౌన్ పోలీసులు బొమ్మూరులోని మహిళా ప్రాంగణంలో ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి విచారణ జరుపుతున్నారు. ఉపాధి కోసం ముంబయి వెళ్తున్నామని యువతులు చెబుతున్నారని రాజకుమారి చెప్పారు. విచారణ తర్వాత ఒరిస్సాలోని వారి వారి స్వగ్రామాలకు పంపిస్తామన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేయిస్తామని, యువతులను రక్షించేందుకు చర్యలు చేపడతామని రాజకుమారి ప్రకటించారు. అయితే ఈ యువతులను బొమ్మూరు మహిళా ప్రాంగణానికి పోలీసులు తరలించారు.

Similar News