శారదా పీఠ ఉత్తరాధికారి పేరు స్వాత్మానందేంద్ర సరస్వతి

Update: 2019-06-17 12:36 GMT

విజయవాడలో నిర్వహిస్తున్న శారదా పీఠం ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్షా మహోత్సవంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పాల్గొన్నారు. తాడేపల్లిలోని గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తరాధికారిగా కిరణ్ కుమార్ శర్మ సన్యాసం స్వీకరించారు. కిరణ్ కుమార్ శర్మ పేరు సన్యాసాశ్రమం స్వీకరణ అనంతరం ఆయన పేరును స్వాత్మానందేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు. స్వాత్మానందేంద్ర సరస్వతి పాదాలకు స్వరూపానందేంద్ర సరస్వతి నమస్కరించారు. ఆ తర్వాత స్వరూపనందేంద్ర సరస్వతి పాదాలకు స్వాత్మానందేంద్ర సరస్వతి పాదపూజ చేశారు. కాగా, స్వాత్మానందేంద్ర సరస్వతికి ఇరు రాష్ట్రాల సీఎంలు కలిసి కిరీటధారణ చేశారు.

Tags:    

Similar News