రెచ్చిపోతున్న పిచ్చికుక్కలు.. పది మందికి గాయాలు

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పిచ్చికుక్కలు రెచ్చిపోతున్నాయి. మున్సిపాల్టీ పరిధిలోని పాత వాటర్ ట్యాంకు ఏరియాలో స్వైర విహారం చేస్తున్నాయి.

Update: 2019-01-08 12:36 GMT

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో పిచ్చికుక్కలు రెచ్చిపోతున్నాయి. మున్సిపాల్టీ పరిధిలోని పాత వాటర్ ట్యాంకు ఏరియాలో స్వైర విహారం చేస్తున్నాయి. జనంపై దాడి చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికి 10 మందిపై దాడి చేయడంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్లీశ్వరి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వరుసగా ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో మున్సిపల్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Similar News