వార్‌ వన్‌ సైడే.. వైఎస్‌ జగన్‌ సీఎం అవ్వడం ఖాయం

Update: 2019-03-31 09:36 GMT

గత ఐదేండ్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలన మొత్తం అవినీతి, మోసమేనని ఈ 2019 ఎన్నికల్లో మాత్రం వార్‌ వన్‌ సైడ్‌ అవుతుందని వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షులు మాదగాని గురునాధం స్పష్టం చేశారు. చంద్రబాబు పాలనతో ఏపీ ప్రజలు విసిగిపోయారని, జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లో కష్టాలను తెలుసుకున్నారని అన్నారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. బహుజన రాజకీయ జనచైతన్య బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు గ్రౌండ్‌ లెవల్‌లో ఎవరికీ చేరడంలేదని, కానీ వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్‌కు ప్రజలనుంచి మంచి ఆదరణ లభిస్తోందని, రాబోయే ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడేనని, వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమన్నారు.

Similar News