శ్రీకాకుళంలో రెవెన్యూ అధికారులపై అటాక్ జరిగింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న వీఆర్వోలపై నైరా గ్రామస్తులు దాడికి దిగారు. కర్రలతో మూకుమ్మడిగా అటాక్ చేయడంతో వీఆర్వోలు చంద్రశేఖర్, విశ్వేశ్వర్రావుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి నుంచి మరో ఇద్దరు వీఆర్వోలు, ఒక వీఆర్ఏ తృటిలో తప్పించుకున్నారు. తప్పించుకున్న రెవెన్యూ అధికారులు శ్రీకాకుళం రూరల్ పీఎస్లో ఫిర్యాదు చేయడంతో... కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... గాయపడ్డ వీఆర్వోలు శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు.