ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు

Update: 2019-06-06 04:35 GMT

ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన అప్పలనాయుడి పేరు ఖరారైంది. దీనికి సంబంధించి ఆయనకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. దీంతో అప్పలనాయుడు ఇవాళ అమరావతికి చేరుకోనున్నారు. అప్పలనాయుడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించారు. ఈసారి ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడుకు అవకాశం దక్కింది. శంబంగినే ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల పన్నెండున అసెంబ్లీ ప్రారంభమైన తరువాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. 

Full View

Tags:    

Similar News