కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమయ్యారు. కుమారుడు కార్తీక్రెడ్డితో కలిసి ఆమె కేటీఆర్తో సమావేశమయ్యారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇంట్లో భేట అయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఆమె పార్టీ మారుతారంటూ గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడారు. తాజాగా కాంగ్రెస్కు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రాజీనామా చేశారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించిన చిరుమర్తి లింగయ్య అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రిజైన్ చేసి టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తానన్నారు. ఈ క్రమంలో సబితా కేటీఆర్ తో సమావేశంపై అందరిలోనూ చర్చనియాశంగా మారింది.