తీగల కృష్ణారెడ్డి ఇంటికి సబితా ఇంద్రారెడ్డి

Update: 2019-03-14 06:50 GMT

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన కుమారుడితో కలిసి మహేశ్వరం టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. దిల్‌సుఖ్‌నగర్‌ తిరుమల హిల్స్‌లోని తీగల నివాసంలో సమావేశం అయ్యారు. త్వరలో టీఆర్ఎస్‌లో చేరనున్న సబిత చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి తన కుమారుడు కార్తీక్‌రెడ్డిని బరిలోకి దించుతున్న నేపథ్యంలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే తమ మధ్య భేటీ మర్యాదపూర్వకంగానే జరిగిందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

Similar News