పాకిస్థాన్ ప్రధాని కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పీఎంవో ఆఫీసులోని ఆరవ అంతస్తులో ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బిల్డింగ్లోని అయిదవ అంతస్తుల్లో ఉన్నట్లు తెలిసింది. ఇక దీంతో పీఎం ఆఫీసు నుంచి ఉద్యోగులను తరలిస్తున్నారు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఓ సమావేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం వార్త తెలియగానే సిబ్బందిని సురక్షితంగా బయటికి పంపించాలని ఇమ్రాన్ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనపై ప్రధాని మంత్రి కార్యాలయం స్పందించింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. కాగా ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.