చంద్రబాబుపై రోజా విమర్శలు ..

Update: 2019-03-17 07:50 GMT

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సీఎం చంద్రబాబు దిగజారి వ్యవహరిస్తున్నారని నగర ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఆరోపించారు. గతంలో పరిటాల హత్య జరిగినప్పుడు సీబీఐ విచారణ కోరిన చంద్రబాబు ఇప్పుడు తాము కోరితే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్యలో అసలు వాస్తవాలు వెలుగుచూడాలని తాము కోరుకుంటున్నామన్నారు. కానీ ఈ రోజు వైయస్ వివేకానంద రెడ్డి హత్య వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న పోలీసులు, ఇంటలీజెంట్స్ చంద్రబాబుకి తొత్తులుగా మారాని నిజానిజాలు బయటికి బయటకి వస్తాయని చంద్రబాబు సీబీఐకి ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

Full View

Similar News