ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారి హత్య కేసు కీలక మలుపు తిరిగింది. రోహిత్ శేఖర్ తివారీ భార్య అపూర్వ శుక్లా తివారీని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ గుండెపోటుతో మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం. అయితే తివారిది సహజ మరణం కాదు అని పోస్టుమార్టమ్లో తేలింది. దీంతో కేసును క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రోహిత్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన కుటుంబీకులను, పనివాళ్లను విచారించారు. అపూర్వ శుక్లా తివారీని గత మూడు రోజులుగా ప్రశ్నించారు. ముఖంపై దిండుతో ఒత్తి రోహిత్ను హత్య చేశారన్న అభియోగాలపై ఆమెను బుధవారం అరెస్ట్ చేశారు.