తిరుమల:- ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని క్రికెటర్ రోహిత్ శర్మ మరియు దినేష్ కార్తిక్ దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఇద్దరు క్రికెటర్లకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ ఫైనల్కి చేరడంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు రోహిత్శర్మ తెలిపారు. ఇద్దరు క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు... దర్శనానంతరం వీరికి తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు...