పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలపై ఎంపీ రాయపాటి సాంబశివరావు క్లారిటీ ఇచ్చారు. తనకు చంద్రబాబుపై నమ్మకం ఉందని టిక్కెట్ కేటాయిస్తారనే అనుకుంటున్నట్లు తెలిపారు. సమయం కావాలని అడిగారు కానీ టిక్కెట్ ఇవ్వనని మాత్రం చెప్పలేదన్నారు. ఒకవేళ తనను కాదని ఇతరులకు టిక్కెట్ కేటాయిస్తే పక్క చూపులు చూడాల్సి వస్తుందని రాయపాటి తెలిపారు. వైసీపీలోకి రావాలని తన సన్నిహితులు కోరుతున్నట్లు రాయపాటి స్పష్టం చేశారు.