ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.6,000... రాహుల్ గాంధీ ప్రకటన

Update: 2019-03-25 09:20 GMT

తాము అధికారంలోకి రాగానే పేద ప్రజల కోసం కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెడతామన్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామన్న ఆయన కనీస ఆదాయ పథకం విధి విధానాలు ప్రకటించారు. ప్రతి పేద కుటుంబానికీ నెలకు రూ.6 వేలు ఇస్తామన్న ఆయన నేరుగా బ్యాంక్ అకౌంట్ లోకి మనీ జమ చేస్తామన్నారు. ఈ పథకం ద్వారా దేశంలో 25 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు రాహుల్. నెలకు రూ.12,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Similar News