వైఎస్‌ జగన్‌ను కలిసిన రఘురామ కృష్ణంరాజు

Update: 2019-03-03 05:44 GMT

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు వైసీపీలో చేరిక విషయం తెలిసిందే. కాగా ఆదివారం వైసీపీ పార్టీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని లోటస్‌ పాండ్‌లోని వైఎస్‌ జగన్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వారం క్రితమే ప్రకటించిన రఘురామ కృష్ణంరాజు అంతలోనే టీడీపీకి షాక్‌ ఇచ్చి వైఎస్‌ జగన్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లగా ఇప్పుడు మళ్లీ పార్టీ మారారు.  

Similar News