ముగిసిన హాజీపూర్‌ సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి పోలీస్‌ కస్టడీ

Update: 2019-05-13 09:47 GMT

హాజీపూర్‌ సైకో కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డి పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో శ్రీనివాస్‌రెడ్డిని వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. గత 5 రోజులుగా శ్రీనివాస్‌రెడ్డిని విచారించిన పోలీసులు నల్గొండ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే పోలీసుల విచారణలో శ్రీనివాస్‌రెడ్డి నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేదని తెలుస్తోంది. ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటంతో శ్రీనివాస్‌రెడ్డిని మరోమారు కస్టడీ కోరేందుకు పోలీసులు భావిస్తున్నారు. దీనికోసం మరోసారి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

Similar News