ఆదిలాబాద్ జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బాసర సరస్వతి ఆలయంలోకి చేతిలో కత్తి పట్టుకుని సైకో సాయి ప్రసాద్ భక్తులను భయబ్రాంతులకు గురిచేశాడు. పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని కత్తి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది వైఫల్యంతోనే సైకో ఆలయంలోకి ప్రవేశించాడని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.