ఎన్నికలు చివరిదశకు చేరుకొని ఫలితాలకు దగ్గరపదుతున్న నేపధ్యంలో మాటలు తారాస్థాయికి చేరిపోతున్నాయి . ఒకరిపై మరొకరు నేతలు మాటల యుద్దానికి దిగుతున్నారు . అయితే తాజాగా ప్రియాంకా గాంధీ ప్రధాని మోడీ పై విరుచుకుక పడ్డారు .. "మోడీ ప్రధాని అనడం కన్నా మంచి నటుడు"అని అభివర్ణించారు .
ప్రధాని పదవికి మోడీ కన్నా అమితాబ్ బచ్చన్ ని ఎంపిక చేసుంటే బాగుండేదని ఆమె ఎద్దేవా చేసారు . అంతేకాకుండా షోలే సినిమాలోని అస్రాని పాత్రతో మోడిని పోల్చారు ప్రియాంకా .. మిర్జాపూర్ లో రోడ్ షో నిర్వహించిన ఆమె మోడీ పై ఈ వాఖ్యలు చేసారు . ఇక అలాగే గోరఖ్ పూర్ సభలో పాల్గొన్న ఆమె మోడిపై నిప్పులు చెరిగారు ..
మోడీ ఎంతసేపు జవహర్ లాల్ నెహ్రు , ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పాలన పనుల గురించి మాట్లాడడమే తప్ప అయన ఎం చేసారో చెప్పారని వాఖ్యానించారు . ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక విజయం సాధిస్తుందని మోడికి ఓటమి తప్పదని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు .