దేశంలో అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే..

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల ర్యాలీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. వారంతా మోడీ వ్యతిరేకులు కాదనీ, దేశానికి, ప్రజల అభివృద్ధికి వ్యతిరేక శక్తులని విమర్శించారు.

Update: 2019-01-19 13:51 GMT

బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నిర్వహించిన విపక్షాల ర్యాలీపై ప్రధాని నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. వారంతా మోడీ వ్యతిరేకులు కాదనీ, దేశానికి, ప్రజల అభివృద్ధికి వ్యతిరేక శక్తులని విమర్శించారు. గుజరాత్‌లోని సిల్వసాలో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ విపక్షాల ర్యాలీపై విమర్శలు గుప్పించారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేని వారే తమపై ఆరోపణలు చేస్తున్నారని మోడీ మండిపడ్డారు. ప్రజల సొమ్మును దోచుకోకుండా అడ్డుపడుతున్నందుకు వారికి తనపై కోపం రావడం సహజమేనని ఎద్దేవా చేశారు. వాళ్ల ఐక్యత కూడా సరిగా లేదన్నారు. అవినీతిపై బీజేపీ ప్రభుత్వ చర్యలు కొంతమందిని కలవరపెడుతున్నాయన్నారు.

Similar News