వరుసగా మూడో రోజు పెరిగిన పెట్రో ధరలు

ఇటీవల కాలంలో మొళ్లీగా తగ్గుతూ వచ్చిన పెట్రో, డీజిల్ ధరలు గత రెండ్రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.

Update: 2019-01-12 09:51 GMT

ఇటీవల కాలంలో మొళ్లీగా తగ్గుతూ వచ్చిన పెట్రో, డీజిల్ ధరలు గత రెండ్రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. నేడు లీటరు పెట్రోల్ ధర రూ.19 పైసలు, లీటరు డీజిల్ ధర రూ.29 పైసలు పెరిగాయి. అయితే అంతర్జాతీయంగా చమురు ధరలు రెండు శాతం తగ్గినా, దేశీయంగా ధరలు పెరుగుతుండటం గమనార్థం. కాగా ఈ నేపథ్యంలో దేశ రాజధాని డీల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.69.26 పైసలకు చేరగా, డీజిల్ ధర రూ.63.10 కి చేరుకున్నాయి. ఇక ముంబయిలో లీటరు పెట్రోల్ ధర రూ. 75, డీజిల్ ధర రూ. 66, కోల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ. 71.39పైసలు, డీజిల్ రూ. 64.87 పైసలు, చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ. 73.87, డీజిల్ ధర రూ. 66.62 పైసలు, ఇక మహానగరంలో లీటరు పెట్రోల్ ధర రూ. 73.41 పైసలు, డీజిల్ ధర. రూ. 68.57 గా ఉన్నాయి.

Similar News