పవన్‌ కల్యాణ్‌ కోరిక అదేనట..

Update: 2019-03-15 11:10 GMT

సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది అని తెలిపారు. లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. బీఎస్పీ, జనసేన పొత్తుపై చర్చించారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని మాయావతి చెప్పారు. మాయావతి ప్రధానమంత్రి కావాలనేది తన ఆకాంక్ష అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇందుకు స్పందించిన మాయావతి పవన్‌ కల్యాణ్‌ ఏపీ కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

Similar News