భారత గగనతలంలోకి పాక్‌ విమానాలు

Update: 2019-02-27 06:56 GMT

నిన్నటి వైమానికి దాడులతో తీవ్ర అసహనంతో ఉన్న పాకిస్తాన్ దుస్సాహసం చేసింది. పాకిస్తాన్ యుద్ధ విమానాలు మన గగన తలంలోకి ప్రవేశించాయి. పాకిస్తాన్‌కు చెందిన F-16 యుద్ధ విమానాలు నియంత్రణరేఖ దాటి నౌషెరా, రాజౌరీ సెక్టార్‌లోకి చొరబడ్డాయి. పాక్ గగనతల ఉల్లంఘనను పసిగట్టిన భారత వైమానిక దళం పాక్ జెట్ ఫైటర్స్‌కు కౌంటర్ ఇచ్చాయి. భారత యుద్ధ విమానాలు ఇచ్చిన గట్టి స్పందనను చూసిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు తోకముడిచి సొంత ప్రాంతానికి వెళ్ళిపోయాయి.

నిన్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్తాన్‌లోని బాలాకోట్ పై భారత వైమానికి దళం భీకర బాంబు దాడులు చేయడంతో పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. నిన్న సాయంత్రం నుంచి వరుసగా కవ్వింపు చర్యలకు దిగుతోంది. యుద్ధానికి రెడీ అనే సంకేతాలు ఇస్తోంది. నిన్నటి నుంచి సరిహద్దుల్లో భారత ఆర్మీ పోస్టులు, ఇళ్ళపై కాల్పులు జరుపుతున్న పాక్ ఇర్మీ ఇప్పుడు గగనతల ఉల్లంఘనకు పాల్పడింది. తన యుద్ధ విమానాలను భారత గగనతలంలోకి అతిక్రమించింది. భారత యుద్ధ విమానాలు ధీటుగా బదులివ్వడంతో తోకముడిచిన పాక్ జైట్ ఫైటర్స్ స్వదేశానికి జారుకున్నాయి. 

Similar News