పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణ కొనసాగుతోంది. రాంప్రసాద్ హత్యలో సుపారీ గ్యాంగ్ హస్తం ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. కోగంటి సత్యం అనుచరుడు శ్యామ్, ప్రసాద్తో పాటు సుపారీ గ్యాంగ్ సభ్యుల కోసం గాలిస్తున్నారు. రాంప్రసాద్ హత్య కేసులో మొత్తం 13 మంది పాత్రధారులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కోగంటి సత్యంతో పాటు 8 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.