ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం

Update: 2019-06-04 03:05 GMT

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రకాశం నుంచి అనంతపూర్ వరకు గ్రేటర్ రాయలసీమ పేరుతో ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల స్థానంలో 12 జిల్లాల ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్‌పై కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపూర్‌తో పాటు చీరాల, తిరుపతి, మదనపల్లె, పుట్టపర్తి, ఆధోని, నంద్యాల జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలపై ప్రభుత్వ సీరియస్‌గా చర్చిస్తోంది. నియోజకవర్గాల వారీగా పునర్విభజన జరిగితే ప్రస్తుతం ఉన్న 76 నియోజక వర్గాల పరిధిలో 98 నియోజకవర్గాల ఏర్పాటు జరిగే అవకాశం ఉంది. అందరి అభిప్రాయాలను తీసుకుని.. కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

Tags:    

Similar News