మహారాష్ట్ర గడ్చిరొలి జిల్లాలో మావోయిస్టుల విధ్వంసానికి దిగారు. రోడ్డు నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్ధపై దాడికి దిగారు. మంగళవారం రాత్రి దాదాపు 150 మంది నక్సలైట్లు ప్లాంట్లోకి చొరబడి కురుకేడలోని డాంబర్ మిక్సింగ్ ప్లాంట్కు నిప్పు పెట్టిన మావోయిస్టులు కాంట్రాక్ట్ పనుల కోసం వినియోగిస్తున్న 30 టిప్పర్లను తగులబెట్టారు. అటవీ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు నిలిపివేయాలంటూ కరపత్రాలు వెదజల్లి వెళ్లిపోయారు. ఘటన గురించి తెలుసుకున్ వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సమీప ప్రాంతాల్లో కూంబింగ్ చేపట్టారు.