ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అహ్మదాబాద్లో ఓటు వేశారు. రాయిసన్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ రనిప్ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ఇవాళ ఉదయం గాంధీనగర్లో తన తల్లి వద్దకు వెళ్లిన మోదీ ఆమె ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. మోదీ ఓటేసిన అనంతరం మాట్లాడుతూ.. ఐఈడీ బాంబుల కన్నా.. ఓటరు ఐడీ అత్యంత శక్తివంతమైనందని వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఉగ్రవాదులకు ఐఈడీ బాంబులే ఆయుధాలు అని, కానీ ప్రజాస్వామ్యానికి ఓటరు ఐడీయే శక్తి అని మోదీ పేర్కొన్నారు.