రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలిసిన మోడీ

Update: 2019-05-25 15:48 GMT

ప్రధాని మోడీ రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ను కలిశారు. బీజేపీ పార్లమెంటరీ నేతగా మోడీ ఎంపిక అనంతరం రాష్ట్రపతిని కలిసి తీర్మాన ప్రతిని అందచేశారు మోడీ. దీనికి సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పక్ష నేతగా మోడీని అమిత్ షా ప్రతిపాదించారు. అమిత్‌ షా ప్రతిపాదనను రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ బలపర్చారు. ఆపై బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని ఎన్నుకున్నారు ఎంపీలు.

Similar News