2019 ఎన్నికల్లో నారా లోకేష్ పోటీకి లైన్ క్లియర్ అయ్యింది. విశాఖ నార్త్ నుంచి నారా లోకేష్ను బరిలోకి దింపాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. తొలుత భీమిలి నుంచి లోకేష్ను బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నా వివిధ సమీకరణల దృష్యా విశాఖ నార్త్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. విశాఖ నార్త్ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ పక్షనేత విష్ణుకుమార్ రాజు. భీమిలి స్థానాన్ని టీడీపీ ఇంకా పెండింగ్ లో ఉంచింది. ఇక్కడి నుంచి మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ టీడీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.