మంగళగిరిలో మళ్లీ నోరుజారిన లోకేష్..ఆర్కే సెటైర్‌!

Update: 2019-03-21 09:52 GMT

ఏపీలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. 2019ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలక టీడీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారాలోకేశ్ మరోసారి నోరు జారారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుండి బరిలో ఉన్న లోకేశ్. అయితే గురువారం ఎన్నికల ప్రచారంలో బాగంగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ బాబు మాట్లాడుతూ వచ్చేనెల ఏప్రిల్‌ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తప్పకుండా టీడీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అయితే లోకేశ్ చేసిన వ్యాఖ్యాలతో టీడీపీ కార్యకర్తలందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు.

లోకేశ్ అన్నా ఎన్నికలు తొమ్మిదో తేదీన కాదు, పదకొండున అని పక్కన ఉన్న టీడీపీ నేత అందివ్వడంతో మంత్రి లోకేశ్ కవర్ చేసుకోలేక తర్జన భర్జన పడ్డారు. అయితే లోకేశ్ చేసిన ఈ తప్పుడు ప్రకటన పట్ల వైసీపీ, జనసేన నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లోకేష్ వీడియో పోస్ట్ చేసి సెటైర్లు మీద సెటైర్లు వేస్తున్నారు. కాగా దీనిపై వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ట్విట్టర్‌లో లోకేష్‌పై కామెంట్లు చేశారు. లోకేష్ చెప్పినట్లుగానే ప్రజలంతా టీడీపీకి ఏప్రిల్ 9న ఓటు వేయాలన్నారు. కానీ ఏప్రిల్ 11న మాత్రం వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్‌కు ఓటేసి గెలిపించాలని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. 

Similar News