ఇటివలే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే కాగా గురువారం నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నామా నాగేశ్వరరావుతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నేతలు కూడా టీర్ఎస్ లో చేరారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు. నామతో పాటు టీడీపీ నేతలు బేబి స్వర్ణకుమారి, అమర్నాథ్ బాబు, అట్లూరి రమాదేవి, బ్రహ్మయ్య తదితరులు కూడా టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ మద్దతుతో టీడీపీ తరఫున బరిలో దిగిన నామా ఒడిపోయిన విషయం తెలిసిందే.