రాజకీయ జీవితంలో తనకు తానుగా నిప్పు అని చెప్పుకునే సీఎం చంద్రబాబు పాలనంతా అవినీతిమం అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. ప్రాజెక్టుల నుంచి రాజధాని వరకు అవినీతి లేకుండా ఒక్క పని అయినా చేశారా ? అంటూ ఆయన ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో ప్రయివేటు సంస్ధలకు చౌకగా భూములు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్ధలకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతోనే పోలవరం నిర్మాణం ఆలస్యమవుతోందని ఆరోపించారు.