ఏపీలో మీ సేవ ఆపరేటర్లుసమ్మె బాట పట్టారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లతో సమస్యలను పరిష్కారించాలని కోరుతూ నేటి నుంచి సమ్మెలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 9 వేల మంది ఆపరేటర్లు సమ్మెలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు. సమ్మె కారణంగా నిలిచిపోనున్న వివిధ ప్రభుత్వ శాఖలతో ప్రమేయమున్న సర్వీసుల సేవలు నిలిచిపోనున్నాయి. ముఖ్యంగా విద్యార్ధులు, రైతులు, ఇతర వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి.