మాజీ మంత్రి, తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇవాళ జూబ్లీహిల్స్లోని మండవ వెంకటేశ్వరరావు నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకుని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. సీఎం కేసీఆర్తో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు మండవ వెల్లడించారు. త్వరలోనే టీఆర్ఎస్లో చేరుతానని మండవ వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఇవాళ ఉదయం మండవ వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, పువ్వాడ అజయ్ కలిశారు. నిజామాబాద్ జిల్లాలో టీడీపీకి మండవ వెంకటేశ్వరరావు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన ఇప్పటివరకూ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేశారు.