సుప్రీంకోర్టులో చేయి కోసుకున్న వ్యక్తి

Update: 2019-04-12 08:03 GMT

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో వద్ద శుక్రవారం ఊహించని ఘటన చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో అందరూ చూస్తుండగానే ఎడమచేతిని కోసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడివారంతా ఉలిక్కిపడ్డారు. దీంతో వెంటనే అక్కడ ఉన్న భద్రత సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి రక్తస్రావం కావడంతో చేతికి గుడ్డ కట్టి అక్కడి నుంచి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Similar News