కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ పాదరక్షల ఫ్యాక్టరీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో ఐదు అంతస్థుల్లోకి మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. మంటలు అధికమవుతుండటంతో సమీప భవనాల్లోని వారిని ఖాళీ చేయించిన అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరాఫరా ను నిలిపేశారు.